Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

రెండు పార్టీలు చేసిన మోసం అందరూ చూశారు..! Vandebharath

  బల్దియా ఎన్నికల సమయంలో మజ్లిస్​తో సంబంధం లేదని ప్రకటించిన టి.అర్.ఎస్ నేతలు.. మేయర్ ఎన్నికలో ఆ పార్టీ మద్దతు ఎలా తీసుకున్నారని గోషామహల్ ఎమ్...





 బల్దియా ఎన్నికల సమయంలో మజ్లిస్​తో సంబంధం లేదని ప్రకటించిన టి.అర్.ఎస్ నేతలు.. మేయర్ ఎన్నికలో ఆ పార్టీ మద్దతు ఎలా తీసుకున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిలదీశారు. మేయర్ ఎన్నికలో టి.అర్.ఎస్, మజ్లిస్ వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారని తెలిపారు. రాష్ట్ర ప్రజలను ఈ రెండు పార్టీలు మోసం చేశాయని మండిపడ్డారు.

గతంలోనూ ఈ రెండు పార్టీలే జీహెచ్ఎంసీని నాశనం చేశారని రాజాసింగ్ ఆరోపించారు. మేయర్ ఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించిన మజ్లిస్.. తెరాసకు ఎందుకు మద్దతు తెలిపిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టి.అర్.ఎస్ కార్పొరేటర్లు ఇలాంటి పార్టీలో ఉంటారా.. బయటకొస్తారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో టి.అర్.ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేస్తే తెరాసకు 15 సీట్లు కూడా వచ్చేవి కాదని అన్నారు.