చెన్నై: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో మూడో రోజు భోజన విరామ సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 59 పరుగులు...
చెన్నై: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో మూడో రోజు భోజన విరామ సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టును 578 పరుగులకు ఆలౌట్ చేసి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(6), శుభమన్ గిల్(29)లను పెవిలియన్ పంపి ఇంగ్లండ్ స్టార్ బౌలర్ అర్చర్ టీమిండియాకు షాకిచ్చాడు. దీంతో 44 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయి భారత్ ఒత్తిడిలో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ఛటేశ్వర పుజారా(14), కెప్టెన్ విరాట్ కోహ్లీ(2)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు సాధించింది.
India 59/2 at Lunch against England on day 3
India 59/2 at Lunch against England on day 3