భారీగా పెరిగిన వెండి ధరలు.. Vandebharath
Silver Price Today: గతకొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధరలు మంగళవారం ఉదయం భారీగా పెరిగాయి. పసిడి ధరలు స్వల్పంగా పెరుగుతుండగా.. సిల్వర్ మాత్రం గణనీయంగా పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరలో రూ.1000 పెరిగి దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు రూ.70,200కు చేరింది. కరోనా కారణంగా దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి.
ఇక హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 73,600 ఉండగా.. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కేజీ సిల్వర్ ధర రూ.73,600కు చేరింది. వీటితోపాటు చెన్నైలో కూడా కిలో వెండి ధర రూ.73,600గానే కొనసాగుతుంది. ముంబై, ఢిల్లీ మార్కెట్లలో కేజీ సిల్వర్ రేటు రూ.70,200 ఉంది.
Post A Comment
No comments :