ఏ క్షణంలోనైనా తిరుపతి అభ్యర్థి ప్రకటన: తిరుపతి లోక్సభ ఉప ఎన్నికపై బిజెపి, జనసేన ల పొత్తు నేపథ్యంలో బిజెపికి ఆ సీటు లభించినా ఇంత...
ఏ క్షణంలోనైనా తిరుపతి అభ్యర్థి ప్రకటన:
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికపై బిజెపి, జనసేన ల పొత్తు నేపథ్యంలో బిజెపికి ఆ సీటు లభించినా ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం కార్యకర్తల్లో ఆగ్రహం తెప్పిస్తున్నది. అతి త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయినా కానీ ఇంత వరకూ బిజెపి అధీష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు..
అయితే గత నాలుగు నెలలగా అత్యధికంగా వినపడుతున్న బిజెపి అభ్యర్ధి పేరు దాసరి శ్రీనివాసులు. కానీ ఇప్పటి వరకూ వినపడని పేర్లు ఈరోజున కావాలని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక క్యాడర్కు చెందిన విశ్రాంత ఐఏస్ అధికారి రత్నప్రభ పేరు ముందుకొచ్చింది, ఆమెను కొంతమంది కావాలని ప్రచారం చేస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. అయితే బిజెపి అభిమానుల్లో మాత్రం అందరికీ తెలిసిన దాసరి గారి పేరే ప్రముఖంగా వినబడుతోంది..
ఎందుకు ఇప్పటికిప్పుడు రత్నప్రభ గారి పేరు వినిపిస్తోంది అంటే ఆమె కుటుంబం కొన్ని తరాల ముందు నుంచే క్రైస్తవాన్ని ఫాలో అవుతోంది మరియు జగన్ కి దగ్గర మనిషి అని కూడా ఒక సమాచారం.. అయితే ఆమెకు కనీసం నియోజకవర్గ పరిధి కూడా తెలీదు అని, నియోజకవర్గ ఓటర్లు వాపోతున్నారు.. అదీగాక ఆమె ఆంధ్రప్రదేశ్ కు కొత్త కూడా. నాయకులతో గానీ, కార్యకర్తలతో గాని ఆమెకు ఎటువంటి పరిచయాలూ ఉన్న దాఖలాలు లేవు. ఒక వేళ ఆమెకే సీటు లభించినట్లయితే ఎక్కడో లాలూచి పడినట్లే అని బిజెపి అభిమానుల్లో చర్చ మొదలయ్యింది.. బిజెపి కి బలమైన సోషల్ మీడియా రెండుగా విడిపోయే అవకాశాలు కూడా బాగా వినపడుతున్నాయి....!!
ఇప్పటికే దాసరి గారు తిరుపతి పార్లమెంటు పరిధిలోని నియోజక వర్గాలలో విస్తృతంగా కలియతిరుగుతూ నాయకులనూ, కార్యకర్తలనూ కలుస్తూ వారిలో ఉత్సాహం నింపుతున్నారు..
ఆయనది ఎవరూ వేలెత్తి చూపలేని కుటుంబ నేపథ్యం కావడంతో సంఘ పెద్దల మద్దతు, కార్యకర్తల మద్దతు ఆయనకే పుష్కలంగా ఉన్నాయి....!!