Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

తొలితరం స్వయంసేవకులు శ్రీ పులుసు గోపిరెడ్డి అస్తమయం - Vandebharath

తెలుగునాట తొలితరం స్వయంసేవకులలో ఒకరు, సంఘవ్యాప్తికై ఒక క్షణం ఆలోచించకుండా కుటుంబంతో వరంగల్లుకు తరలివెళ్లి కృషిచేసిన వారు, తెలుగునాట సంఘచరిత్...



తెలుగునాట తొలితరం స్వయంసేవకులలో ఒకరు, సంఘవ్యాప్తికై ఒక క్షణం ఆలోచించకుండా కుటుంబంతో వరంగల్లుకు తరలివెళ్లి కృషిచేసిన వారు, తెలుగునాట సంఘచరిత్రను గ్రంథస్థంచేసిన శ్రీ పులుసు గోపిరెడ్డి ఇక లేరు. దాదాపుగా రెండుసంవత్సరాలుగా ఇంటికి, అందులోనూ ఎక్కువ సమయం మంచానికీ పరిమితమై ఉన్నా , అన్ని విషయాలలో అప్ టు డేట్ గా ఉన్నారు. వీలైతే కూర్చొని,అది సాధ్యంకాకపోతే పడుకొని అన్ని విషయాలూ మాట్లాడేవారు.

వాకాడు(విద్యానగర్) కళాశాలలో, నెల్లూరు వి‌.అర్ కళాశాలలో, అలాగే వికారాబాద్ లో లెక్చరర్ గా పనిచేశారు. విజయవాడలో శారదా జూనియర్ కాలేజి వ్యవస్థాపక ప్రిన్సిపాల్ గా, సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేశారు. అక్కడనే పదవీ విరమణ చేశారు. వారి పదవీ విరమణ కార్యక్రమానికి అప్పటి ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ శ్రీ శేషాద్రి గారు హాజరయ్యారు. ఉద్యోగవిరమణ తర్వాత మూడు సంవత్సరాలపాటు చత్తీస్ గఢ్ వెళ్లి వనవాసుల సేవలో కొత్త కోణాలను ఆవిష్కరించి వచ్చారు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘమేగాక, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూడా వారి మార్గదర్శనం పొందింది. సమాలోచన అనే మేథావుల వేదికకు వారు చిరకాలం అధ్యక్షులుగా ఉండి ఎందరో పెద్దలను విజయవాడకు పిలిపించి ఉపన్యాసాలిప్పించారు. విజయవాడలో శ్రీ విజ్ఞాన విహార పాఠశాల ఏర్పాటులో, వాటిని ముందుకు నడిపించడంలో వారు మార్గదర్శకులుగా ఉన్నారు.

జాగృతి పత్రికలో దశాబ్దంపైగా ‘మనలోమాట’ అనే శీర్షికను నిర్వహించారు. రాణాప్రతాప్, ఎదిగిన మనిషి(నవల), తరంమారింది (కథల సంపుటి), వికసిత సంఘ కుసుమం (మా. సోమేపల్లి సోమయ్యగారి జీవిత పరిచయం) దారిచూపిన దీపకళిక (శ్రీ గురూజీ జీవిత పరిచయం), వనయోగి (బాలాసాహెబ్ దేశపాండే జీవితపరిచయం), మరువరాని మహామహులు మొదలైన ఎన్నో గ్రంథాలను రచించారు. విజయవాడలో, ఆ సమీప జిల్లాలలో సంఘానికి, జాతీయభావంతో మెలగే ఉద్యమాలకూ పెద్దదిక్కుగా ఉండిన శ్రీగోపిరెడ్డిగారి మరణం ఒక పెద్దలోటు.జాతీయభావంతో మెలగే ఉద్యమాలకూ పెద్దదిక్కుగా ఉండిన శ్రీగోపిరెడ్డిగారి మరణం ఒక పెద్దలోటు.