Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మత్తులో మాజీ సర్పంచ్ సతీశ్ .. వేరొకరి ఇంట్లో దూరాడు - Vandebharath

  మాజీ సర్పంచ్ అప్పటికే తాగిన మత్తులో ఉన్నాడు. అతని వెంట మరో యువకుడు కూడా ఉన్నాడు. దీంతో ఇంట్లోకి వచ్చిన ఇద్దర్నీ కూడా స్థానికులు, కుటుంబసభ్...

 


మాజీ సర్పంచ్ అప్పటికే తాగిన మత్తులో ఉన్నాడు. అతని వెంట మరో యువకుడు కూడా ఉన్నాడు. దీంతో ఇంట్లోకి వచ్చిన ఇద్దర్నీ కూడా స్థానికులు, కుటుంబసభ్యులు పట్టుకున్నారు.


కొందరు మద్యం తాగితే ఏం చేస్తారో వారికే తెలియదు. తాగిన మత్తులో ఏవేవో వింత చేష్టలకు దిగుతుంటారు. నోటికొచ్చిందల్లా వాగుతుంటారు. మద్యం మత్తులో వారు ఏం చేస్తున్నారో వారిక తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. అలా మద్యం మత్తులో ఓ మాజీ సర్పంచ్ చేసిన పని... అతడు ఒళ్లు ఓనం అయ్యేలా చేసింది. తాగని మత్తులో ఎవరి ఇంట్లో పడితో వారింట్లో దూరితే ఊరుకుంటారా? నాలుగేసి గుండగా చితక్కొట్టేయరు. ఈ మాజీ గ్రామ పెద్ద కూడా అదే చేశాడు. తాగిన మత్తులో వేరొకరి ఇంట్లో దూరాడు.

దీంతో మాజీ సర్పంచ్‌కు దేహశుద్ధి జరిగింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. మాజీ సర్పంచ్‌ మాదాసు సతీశ్‌ పూటుగా మద్యం సేవించాడు. గడిచిన రాత్రి పెగడపల్లిలోని ఓ ఇంట్లో చొరబడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సతీశ్‌కు దేహశుద్ధి చేశారు. సతీశ్‌ వెంట వచ్చిన యువకుడికి కూడా దేహశుద్ధి చేశారు స్థానికులు. అనంతరం ఇద్దర్నీ కూడా కాల్వశ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.