Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మలాలాకు బెదిరింపులు..Vandebharath

  హైదరాబాద్ :  నోబెల్ బహుమతి గ్రహీత మలాల యూసఫ్ జాయ్ కు బెదిరింపులు వచ్చాయి. పాకిస్థాన్ కు చెందిన మలాలాపై 2012లో కాల్పులు జరిగిన సంగతి తెలిసి...

 


హైదరాబాద్ : నోబెల్ బహుమతి గ్రహీత మలాల యూసఫ్ జాయ్ కు బెదిరింపులు వచ్చాయి. పాకిస్థాన్ కు చెందిన మలాలాపై 2012లో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. స్కూలు నుంచి తిరిగి వస్తున్న ఆమెపై ఎహ్సానుల్లా ఎహ్సాన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఆమె శరీరంలోకి మూడు బుల్లెట్లు దిగినప్పటికీ... ఆమె ప్రాణాల నుంచి బయటపడింది. తాజాగా అదే వ్యక్తి మరోసారి ఆమెను బెదిరించాడు. ట్విట్టర్ ద్వారా హెచ్చరించాడు. నీతో, మీ నాన్నతో లెక్కలు తేల్చుకోవాల్సిన అవసరం ఉందని... ఇంటికి తిరిగి వచ్చేయాలని, ఈసారి ఎలాంటి పొరపాటు జరగదని ట్విట్టర్ ద్వారా బెదిరించాడు. ఈ ట్వీట్ ను మలాలా రీట్వీట్ చేసింది. 'తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్' అనే ఉగ్రసంస్థకు ఇతను మాజీ అధికార ప్రతినిధి అని మలాలా తెలిపింది. గతంలో తనపై దాడికి పాల్పడింది ఇతనే అని చెప్పింది. తనతో పాటు చాలా మందిపై ఇతను దాడి చేశాడని తెలిపింది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా జనాలను బెదిరిస్తున్నాడని మండిపడింది. ఇతను జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ ట్వీట్ ను పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ మిలిటరీకి ట్యాగ్ చేసింది.