Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

బెంగాల్ ఎన్నికల్లో గంగూలీ సపోర్ట్ ఆ పార్టీకేనా..? దాదా పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠ..Vandebharath

  కేంద్ర ఎన్నికల సంఘం... ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించగానే... కీలకమైన పశ్చిమ బెంగాల్, మిగతా మూడు రాష్ట్రాలు... కేంద్ర పాలిత ప్రాంతం ...

 

కేంద్ర ఎన్నికల సంఘం... ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించగానే... కీలకమైన పశ్చిమ బెంగాల్, మిగతా మూడు రాష్ట్రాలు... కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రాజకీయాలు బాగా వేడెక్కాయి. రకరకాల రూమర్లు తెరపైకి వస్తున్నాయి.

బెంగాల్‌ అసెంబ్లీలో తిరుగులేని పార్టీగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్, కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తోంది. ఇదే క్రమంలో రెండు పార్టీలూ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఇరు పార్టీల్లో ప్రముఖ సినీ గ్లామర్‌తో పాటు క్రికెటర్లు, సెలబ్రిటీలను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా బెంగాల్ దాదా సౌరబ్ గంగూలీ రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్... బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (BCCI) అధ్యక్షుడు అయ్యాడో... అప్పటి నుంచే ఈయన బీజేపీలోకి వెళ్తాడనే ప్రచారం ఊపందుకుంది.

తాజాగా ఎన్నికల హడావుడి మొదలు కావడంతో.. తనను బీసీసీఐ అధ్యక్షుణ్ని చేసినందుకు రుణం తీర్చుకునేలా గంగూలీ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి.

గంగూలీ జాయినింగ్‌పై బీజేపీ నేతలు గుసగుసలు కూడా ఎక్కువయ్యాయి. గంగూలీ తమ పార్టీలో చేరితే. ఆయనకు ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు అప్పగిస్తామనీ. బెంగాల్‌కి పరిమితం చేయబోమని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అయితే, మార్చి 2న అమిత్ షా కోల్‌కతాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో. ఆయన బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌తో కలిసి జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది.

అయితే, గతంలోనే గంగూలీ బీజేపీలోకి వస్తారన్న వార్తలు వెలువడ్డాయి. అంతలోనే సౌరవ్ అనారోగ్యానికి గురయ్యారు. రెండు సార్లు ఆంజియోప్లాస్టీ సర్జరీ నిర్వహించారు. దాదాకు ప్రస్తుతం ఉన్న స్టెంట్లకు అదనంగా మరో రెండు స్టెంట్లు వేశారు వైద్యులు. కాగా ఇటీవల గంగూలీకి పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయన మళ్లీ చురుకుగా కార్యక్రమాల్లో పాల్గోంటున్నారు.

మరోవైపు, రాజకీయాల జోలికి గంగూలి రాకపోవచ్చని తృణమూల్ కాంగ్రెస్ ఇటీవల అభిప్రాయ పడింది. గంగూలీ బెంగాల్‌కి గర్వకారణమనే విషయం అందరికీ తెలిసిందేనని, కొందరు ఎన్నికలను "దీదీ వెర్సస్ దాదా"గా ప్రాజెక్టు చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ గంగూలీ చాలా తెలివైన వాడని, బీజేపీ ఉచ్చులో పడరని టీఎంసీ నేతలు అంటున్నారు.

2015లో జగ్‌మోహన్ దాల్మియా తర్వాత BCCI బాస్‌గా గంగూలీని నియమించడంలో మమతా బెనర్జీ పాత్ర ఉంది. ఐతే... గంగూలీ మాత్రం రాజకీయ అంశాలపై స్పందించట్లేదు. రాజకీయాల్లో చేరబోనని అంటున్నారు. ఆయన వర్గీయులు మాత్రం... చేరేవాళ్లైతే ఎప్పుడో చేరేవారనీ... భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చని అంటున్నారు. క్రికెట్‌లో పెద్దరికం కొనసాగించాలంటే... గంగూలీకి బలమైన పార్టీ అవసరం ఉంటుంది అనే వాదన ఉంది.