అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఏపీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 82 మందికి కొవిడ్-19 పాజిట...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఏపీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 82 మందికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 889585కు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 611గా ఉంది. ఇప్పటి వరకు 881806 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7168గా ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.