ఛత్తీస్గఢ్లో మావోయిస్టు లకు కోలుకోలేని దెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన భీకరమైన ఎన్కౌంటర్ లో కనీసం 10 మంది మా...
ఛత్తీస్గఢ్లో మావోయిస్టు లకు కోలుకోలేని దెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన భీకరమైన ఎన్కౌంటర్ లో కనీసం 10 మంది మావోయిస్టులు మృతి చెందారు.
అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో ఎస్టీఎఫ్, డీఆర్జీ బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు 10 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు.
ఈ సంఘటనను బీజాపూర్ ఎస్పీ మోహిత్ గార్గ్ ధృవీకరించారు. ఘటనాస్థలిలో 11 ఆయుధాలతో పాటు భారీగా మందుగుండు సామాగ్రి, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు మావోయిస్టులు దట్టమైన అడవిలోకి పారిపోయినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతి చెందిన మావోయిస్టులను పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు.