హైదరాబాద్ : ఐపిఎల్ను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నిర్వహించాలని మంత్రి కెటిఆర్ బిసిసిఐని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం బిసిసిఐ తో ...
హైదరాబాద్ : ఐపిఎల్ను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నిర్వహించాలని మంత్రి కెటిఆర్ బిసిసిఐని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం బిసిసిఐ తో పాటు ఐపిఎల్ ఆఫీస్ బేరర్లను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. వచ్చే ఐపిఎల్ సీజన్ లో హైదరాబాద్ ను వేదికగా చేయాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కరోనా నియంత్రణ చర్యల కారణంగా హైదరాబాద్ లో అతి తక్కువ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. హైదరాబాద్ లో ఐపిఎల్ ను నిర్వహిస్తే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.