అబుజా : సైనిక విమానం కూలి ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన నైజీరియాలో ఆదివారం చోటుచేసుకుంది. నైజీరియా రాజధాని అబుజా సమీపంలో జరిగిన ప్రమాదంల...
అబుజా : సైనిక విమానం కూలి ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన నైజీరియాలో ఆదివారం చోటుచేసుకుంది. నైజీరియా రాజధాని అబుజా సమీపంలో జరిగిన ప్రమాదంలో సైనిక విమానం కూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించినట్లు ఆ దేశ వైమానిక దళ ప్రతినిధి తెలిపారు. ఇదే విషయాన్ని నైజీరియా విమానయానశాఖ మంత్రి సిరికా హాడి ధృవీకరించారు. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. కానీ ఇంజిన్ విఫలమైనట్లుగా పైలట్ నివేదించినట్లు అధికారులు వెల్లడించారు. ఇంజిన్ వైఫల్యం కారణంగా అబుజా విమానాశ్రయానికి విమానం తిరిగి వస్తున్న క్రమంలో కూలిపోయిందని చెప్పారు. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుందని వైమానిక దళం పేర్కొంది.