శ్రీకాకుళం: టీడీపీ నేత కళా వెంకట్రావు సొంత ఊరు రేగిడిలో టీడీపీ మద్దతుదారుడు గెలిచారు. రేగిడి సర్పంచ్గా కిమిడి రేణుక 700 ఓట్ల మెజారిటీతో...
శ్రీకాకుళం: టీడీపీ నేత కళా వెంకట్రావు సొంత ఊరు రేగిడిలో టీడీపీ మద్దతుదారుడు గెలిచారు. రేగిడి సర్పంచ్గా కిమిడి రేణుక 700 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జిల్లాలో రెండో విడుత పంచాయతీలు ఎన్నికలు బుధవారం జరిగాయి. 207 పంచాయతీల్లో 1,720 వార్డులకు ఈ విడతలో ఎన్నికలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 3.30 వరకు పోలింగ్ నిర్వహించారు. రెండో దశలో 248 పంచాయతీలకు ఎన్నికల నిర్వహించాల్సి ఉంది. కోర్టు ఆదేశాల కారణంగా డెంకాడ మండలంలోని పెదతాడివాడ, గుండాలపేట.. గరివిడి మండలంలోని రేగటి అగ్రహారం, నీలాద్రిపురంతో పాటు మరికొన్ని పంచాయతీల ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో 207 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు.