Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ధౌలిగంగా నది సృష్టించిన జలప్రళయం - Vandebharath

  ఉత్తరాఖండ్‌ జలవిలయంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 31 మంది మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. మిగిలినవారి ఆచూకీ కోసం ఆర్మీ, ఎన...


 

ఉత్తరాఖండ్‌ జలవిలయంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 31 మంది మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. మిగిలినవారి ఆచూకీ కోసం ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ బలగాలు వెతుకున్నాయి. మరోవైపు ఉత్తరాఖండ్‌లో గాలింపు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని హోంమంత్రి అమిత్‌ షా చెప్పారు. దీనికి గల కారణాలపై ఇస్రో, డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.


ఉత్తరాఖండ్‌లోని ధౌలిగంగా నది సృష్టించిన జలప్రళయం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 31 మంది మృతి చెందారు. నిన్న మరో ఐదు మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 203 మంది గల్లంతయ్యారు. ఎన్టీపీసీ ప్రాజెక్టుకు చెందిన రెండో టన్నెల్‌లో 30 మంది వరకు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వారిని కాపడటానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మొదటి టన్నెల్‌ నుంచి 12 మందిని సురక్షితంగా తీసుకొచ్చారు.

ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఇస్రో డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. నందాదేవి పర్వత శిఖరానికి సమీపంలోనే రైనీ గ్రామం ఉంది. ప్రమాదాన్ని కొంత మంది గ్రామస్తులు దగ్గరి నుంచి చూశారు. పర్వత శిఖరం పైనుంచి మంచు కొండ ఒక్కసారిగా విరిగి కుప్పకూలింది. అందులోంచి ఉప్పెనలా నీరు పొంగి రిషిగంగా నదిలోకి దూకింది. దీంతో వరద ఉధృతి పెరిగింది. ఆ ప్రవాహం.. అడ్డుగా ఉన్న రాళ్లను, డ్యామ్‌లను నాశనం చేస్తూ ముందుకు సాగింది. ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొందని గ్రామస్తులు నాటి విషాదాన్ని గుర్తు చేసుకున్నారు.

శిఖరం పైనుంచి భారీ శబ్దంతో మంచు కొండ విరిగిపడిన వెంటనే అక్కడ ఘాటైన వాసన వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ఆ వాయువు చాలా ఘాటుగా ఉందని.. మేం కొద్దిసేపు ఊపిరి పీల్చుకోలేకపోయామన్నారు. ఇది మంచు కొండ విరిగిపడటం, శిథిలాల కారణంగా వచ్చి ఉండదని అభిప్రాయపడ్డారు. దాంతో తమకు రేడియో యాక్టీవ్‌ పరికరం మీద అనుమానం వచ్చిందని.. పెద్దలు తరచూ చెప్పే మాటలు గుర్తుకొచ్చాయన్నారు. నందాదేవి శిఖరంపై రేడియో యాక్టివ్ పరికరం మిస్సైన ఘటన గురించి పెద్దలు మాకు అనేక సార్లు చెప్పారని తెలిపారు గ్రామస్తులు.

1965లో నందాదేవి శిఖరంపై అణుశక్తితో కూడిన న్యూక్లియర్ పరికరాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. చైనాపై నిఘా ఉంచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించారు. పర్వత శిఖరాన్ని పరిశీలించానికి వెళ్లిన అధికారుల బృందం ఊహించని ప్రమాదం బారిన పడింది. దాంతో ప్రాణాలతో బయటపడే క్రమంలో ఆ రేడియో యాక్టివ్ డివైస్‌ను అక్కడే వదిలేశారు. మరుసటి సంవత్సరం అధికారులు అక్కడికి మళ్లీ వెళ్లారు.. అయితే ఆ పరికరం మాత్రం కనిపించలేదని చెప్తున్నారు గ్రామస్తులు.

2018లో పర్యాటక మంత్రి సప్తాల్ మహరాజ్ ఆ రేడియోధార్మిక పరికరం గురించి ప్రస్తావించాడు. నందాదేవి శిఖరంపై మిస్సైన ఆ పరికరం.. ఆ మంచు కొండలను కలుషితం చేస్తోందని.. దాన్ని వెలికితీయడానికి తక్షణమే ప్రయత్నాలు ప్రారంభించాలని ప్రధాని మోడీని కోరారు. ఏది ఏమైనా ప్రమాదానికి గల కారణాలను అధికారులు తేల్చాల్సి ఉంది.