హైదరాబాద్: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపీఎల్)ను హైదరాబాద్లో నిర్వహించేలా బీసీసీఐపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇక్కడ ఐపీ...
హైదరాబాద్: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపీఎల్)ను హైదరాబాద్లో నిర్వహించేలా బీసీసీఐపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇక్కడ ఐపీఎల్ నిర్వహించాలంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇప్పటికే బీసీసీఐని కోరిన విషయం తెలిసిందే. తాము తీసుకున్న కొవిడ్ కట్టడి చర్యల కారణంగా హైదరాబాద్లో చాలా తక్కువ కేసులు నమోదయ్యాయని, ఐపీఎల్ నిర్వహించడానికి తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ కూడా కేటీఆర్కు మద్దతు తెలిపారు. కేటీఆర్ చేసిన విజ్ఞప్తికి నేను సపోర్ట్ చేస్తున్నాను. బీసీసీఐ ఆదేశాల ప్రకారం ఐపీఎల్ను నిర్వహించే సామర్థ్యం కచ్చితంగా హైదరాబాద్కు ఉంది. బయో సెక్యూర్ బబుల్ను మేము సిద్ధం చేస్తామని ఆయన ట్వీట్ చేశారు.
ఈ సీజన్ ఐపీఎల్ కోసం బీసీసీఐ ఆరు నగరాలను షార్ట్లిస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అందులో హైదరాబాద్ పేరు మాత్రం లేదు. ఢిల్లీతోపాటు కోల్కతా, చెన్నై, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్ నగరాలను షార్ట్లిస్ట్ చేశారు. అయితే ఈ నగరాలతో పోలిస్తే నిజానికి హైదరాబాద్లోనే కొవిడ్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఐపీఎల్ను హైదరాబాద్లో నిర్వహించాలని కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేశారు.