జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపొరా ప్రాంతంలోని సాంబూరాలో ఉగ్రవాదులు ఉన్నారని ...
జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపొరా ప్రాంతంలోని సాంబూరాలో ఉగ్రవాదులు ఉన్నారని అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చేపట్టాయి.
భద్రతాబలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ఓ పోలీస్ అధికారి చెప్పారు. భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని, వారు ఏ గ్రూప్కు చెందిన వారన్న సంగతి ఇంకా తెలియరాలేదన్నారు.