Page Nav

HIDE

Grid

GRID_STYLE
Friday, July 25

Pages

కోవిడ్-19: ఏ ఆహారం తీసుకోవాలి? - ఏ ఆహారం తీసుకోకూడదు? - vandebharath

  దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రతిరోజు దాదాపు 80 వేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవి...

 


దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రతిరోజు దాదాపు 80 వేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 బారిన పడకుండా మాస్క్ ధరించడం, తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూనే సరైన పౌష్ఠిక ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.

శాఖాహారం

తినవలసినవి:
* బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్ మరియు చిరుధాన్యాలు మొదలగు వాటిని తినండి
* బీన్స్, చిక్కుడు మరియు పప్పు ధాన్యాలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ పొందగలరు
* ఆహారంలో తాజా పండ్లు మరియు కూరగాయలు (కాప్సికమ్, క్యారెట్, బీట్ రూట్ మరియు వంకాయ మొదలగు వాటిని) చేర్చండి
* రోజులో కనీసం రెండు లీటర్ల గోరు వెచ్చని నీటిని త్రాగండి
* పుల్లని నిమ్మ పండు, బత్తాయి తీసుకోండి. వీటిలో వ్యాధి నిరోధక శక్తిని కలుగచేయు సి విటమిన్ ఉంటుంది.
* ఆహారంలో మసాలా ద్రవ్యాలైన అల్లం, వెల్లుల్లి, పసుపు మొదలగు వాటిని చేర్చండి. ఇవి వ్యాధి నిరోధక శక్తి యొక్క సహజత్వాన్ని పెంపొందిస్తాయి
* ఇంటిలో వండిన ఆహారాన్ని మాత్రమే తినండి. క్రొవ్వు పదార్థాలు మరియు నూనెలను తక్కువగా వాడండి
* పండ్లను, కూరగాయలను తినడానికి ముందు శుభ్రంగా కడగండి
* వెన్న తీసిన పాలు మరియు పెరుగును తీసుకోండి. వీటిలో ప్రోటీన్ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

తినకూడనివి:
* మైదా, వేపుళ్ళు మరియు జంక్ ఫుడ్ (చిప్స్, కుక్కీస్) తినకండి
* శీతల పానీయాలు, ప్యాక్ట్ జ్యూస్ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగకండి. వీటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి
* చీజ్, కొబ్బరి మరియు పామాయిల్, బటర్ తినకండి. వీటిలో అనారోగ్యాన్ని కలిగించే కొవ్వు పదార్థాలు ఉంటాయి

మాంసాహారం

తినవలసినవి:
* మాంసాహారాన్ని తాజా పదార్ధాలతో పాటు నిల్వ ఉంచకండి
* స్కిన్ చికెన్, చేపలు మరియు గ్రుడ్డు తెల్లసొన మొదలగు వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది వీటిని తీసుకొనుటకు ప్రాధాన్యత ఇవ్వండి.

తినకూడనివి:
* మాంసం, లివర్, వేపిన మాంసాన్ని తినకండి
* వారంలో రెండు నుంచి మూడు రోజులు మాత్రమే మాంసాహారాన్ని తీసుకోండి
* పూర్తి గ్రుడ్డుని (పచ్చసొనతో కలిపి) వారంలో ఒక్కసారి మాత్రమే తీసుకోండి

గమనిక: కోవిడ్ వైరస్ సోకిన వారిలో 80 శాతం మందికిపైగా ఎటువంటి లక్షణాలు కనిపించక పోవచ్చు లేదా స్వల్ప లక్షణాలైన తక్కువ జ్వరం లేక దగ్గు మాత్రమే కనిపించవచ్చు. అటువంటి వారు ఈ ఇంట్లో ప్రత్యేకంగా ఉండడానికి అవసరమైన సౌకర్యాలు ఉన్నట్లయితే ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేదని, ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

SCO మీటింగ్ కంటే ముందే ఉగ్రవాదంపై భారత్ బలమైన సంకేతం! - SCO ...

మోస్ట్ వాంటెడ్ షార్ప్ షూటర్ షారుక్ పఠాన్ ఎన్‌కౌంటర్‌లో హతం: ...

Nehal Modi Arrested in US: Extradited Under PNB Scam Charges...

3 Pakistani Army Brigadiers Visit Dhaka: Indian Intel Flags ...

UK Faces Backlash for Double Standards in India-Russia Cover...

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ లకు సుప్రీంకోర్టు సీ...

భారత్‌ సరిహద్దు ప్రాంతాలపై పాకిస్థాన్‌ రాకెట్లు, డ్రోన్ల వర్...

యుద్ధం మధ్యలో మేం కలుగజేసుకోము అమెరికా వైస్ ప్రెసిడెంట్ - wi...

పాకిస్థాన్ 5 ముక్కలవుతుంది 1971 లో చెప్పిన శ్రీ మాత - Is pak...

ఆపరేషన్ సింధూర్ - What is Operation Sindoor in Telugu