Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

కోహ్లి దగ్గరకు పరిగెత్తుకెళ్లిన ఫ్యాన్....వెళ్లిపోమన్న కెప్టెన్ - Vandebharath

  ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన మొతేరా వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. టాస్ గెలిచి ము...

 


ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన మొతేరా వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. భారత స్పిన్నర్ల ధాటికి 113 పరుగులకే కుప్పకూలింది. బదులుగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లి సేన 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. రోహిత్ 57 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. రహానే ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నాడు. తొలి రోజు ఆఖరి ఓవర్లో జాక్ లీచ్.. విరాట్ కోహ్లిని బౌల్డ్ చేయడంతో భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. కాగా తొలి రోజు మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని సెక్యూరిటీని తప్పించుకొని.. బయోబబుల్‌ నిబంధనలను ఉల్లంఘించి మైదానంలోకి దూసుకొచ్చాడు. కోహ్లిని కలవడం కోసం అతడు గ్రౌండ్లోకి వచ్చేయగా.. బయోబబుల్ రూల్స్‌ను దృష్టిలో ఉంచుకొని కోహ్లి వెనక్కి వెనక్కి జరిగాడు. మైదానంలోకి వచ్చిన అభిమానిని వెనక్కి వెళ్లాలని సూచించాడు. తన తప్పిదాన్ని గ్రహించిన ఆ ఫ్యాన్..

వెనక్కి మళ్లగా.. స్టేడియంలోని మిగతా అభిమానులు కేరింతలు కొట్టారు. బయో బబుల్ ప్రొటోకాల్స్ ప్రకారం.. ఆటగాళ్లు, మ్యాచ్ అఫీషియల్స్ ఎవర్నీ కలవడానికి వీల్లేదు.

శిక్షణ సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా స్టేడియంలో సామర్థ్యంలో సగం మంది అభిమానులకే అనుమతిస్తున్నారు. స్టేడియంలోకి వచ్చిన అభిమాని ఎవరనే విషయమై ఆరా తీస్తున్నామని జీసీఏ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నామని.. చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.