Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

కేంద్రానివన్నీ తెలంగాణ కాపీ పథకాలే.. విభజన హామీలు నెరవేర్చని పార్టీలను ఓడించాలన్న హరీశ్‌రావు - Vandebharath

  తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఫలితాలతో అసంతృప్తితో ఉన్న అధికార పార్టీ టీఆర్‌ఎస్‌.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పెషల్‌ ఫోకస...

 


తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఫలితాలతో అసంతృప్తితో ఉన్న అధికార పార్టీ టీఆర్‌ఎస్‌.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఎన్నికలు జరుగుతున్న రెండు స్థానాల్లో గులాబీ జెండా ఎగిరేయాలనే లక్ష్యంతో ముందుగు సాగుతుంది ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపిన గులాబీ అధినేత ప్రత్యర్థుల అంచనాలకు భిన్నంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. శాసనమండలి ‘హైదరాబాద్‌– రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌’ పట్టభద్రుల నియో జకవర్గానికి చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించిన టీఆర్‌ఎస్‌.. ప్రచార వ్యూహాన్ని పక్కాగా అమలు చేయడంపై దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నంలో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాలకు ఓటేస్తే ఏం లాభమని, వారేమైనా అధికారంలో ఉన్నారా అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పేరు నిషేధమని, ఎన్నికల కోసమే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ పేరును ఉచ్ఛరించేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఇబ్రహీంపట్నం నుంచే ప్రారంభమైందని చెప్పారు. 70 నుంచి‌ 80 శాతం ఓటింగ్ జరిగేలా చూడాలని, ఓటింగ్ శాతం పెరిగితే టీఆర్‌ఎస్‌దే విజయమన్నారు. బీజేపీకి, కాంగ్రెస్ పార్టీలకు‌ లేని నెట్‌వర్క్ తమకు ఉందని, కష్టపడి పని చేస్తే గెలుపు ఖాయమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తిని 16 వేల మెగావాట్లుకు పెంచామని చెప్పారు. తెలంగాణలో‌ తప్ప దేశంలో ఎక్కడైనా రైతులకు ఉచిత‌ంగా 24 గంటల విద్యుత్ ఇస్తున్నారో చూపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు 70 ఏండ్లు అధికారంలో ఉన్నాయని, కనీసం తాగడానికి నీరు ఇచ్చాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు నీటి తీరువా, శిస్తులు వసూలు చేస్తే.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వచ్చాక వాటిని రద్దు చేయడమేకాకుండా, ఎకరానికి రూ.10 వేలు రైతుబంధు కింద ఇస్తున్నామని చెప్పారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మన రైతు బంధును కాపీ కొట్టి రూ.6 వేలు ఇస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో పేదింటి యువతి పెండ్లికి రూ.లక్ష ఇస్తున్నామని, దీనినే గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను మిషన్‌ భగీరథ, రైతుబంధు, కల్యాణలక్ష్మి పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని విమర్శించారు. దేశంలో ఇన్నేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ.. ఏ రాష్ట్రంలో అయినా ఇంటింటికీ ‌తాగు నీరు ఇచ్చిందా? అని ప్రశ్నించారు.

విభజన చట్టంలో రేల్వే కోచ్ ఫ్యాక్టరీ, వెనుకబడిన ప్రాంతానికి రూ.400 కోట్లు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ ఇస్తామని హామీ చేశారని, దమ్ముంటే బీజేపీ నేతలు వీటిని‌ తీసుకొచ్చి మాట్లాడాలని సవాల్‌ విసిరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇవ్వాల్సినవి ఇవ్వడానికి చేతకాదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి దేశ‌ వృద్ధిరేటు 8 ‌శాతంగా ఉందని, ప్రస్తుతం అది మైనస్ 8 ‌శాతానికి పడిపోయిందని విమర్శించారు. అదే తెలంగాణ 14 శాతం వృద్ధి రేటు సాధించిందని చెప్పారు. తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటే ‌ కిషన్ రెడ్డి తప్పించుకున్నారని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని పీవీ కుమార్తెగా కాకుండా ‌విద్యావేత్తగా, సేవాభావం కలిగిన వ్యక్తిగా చూడాలని, ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి కోరారు. ఇబ్రహీంపట్నంకు కృష్ణా నీటిని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వారు ప్రశ్నించే‌ గొంతులమని అంటున్నారు. మేం సమస్యలను పరిష్కరించేవారిమని వెల్లడించారు. మొత్తానికి టీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్‌ ఎన్నికల ప్రచారం రంగంలోకి దిగడంతో ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పడుతున్నాయి.